Accident Deaths | న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుముఖం పడుతుంటే.. భారత్లో మాత్రం ఏటా పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2011-21 మధ్య రోడ్డు ప్రమాద మరణాల్లో 5 శాతం తగ్గుదల నమోదైనట్టు పేర్కొన్నది. అయితే ఇదే వ్యవధిలో భారత్లో ఈ సంఖ్య పెరిగినట్టు వెల్లడించింది.
ఈ పదేండ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాల సంఖ్య 1.25 మిలియన్ల నుంచి 1.19 మిలియన్లకు తగ్గగా, భారత్లో మాత్రం 1.34 లక్షల నుంచి 1.54 లక్షలకు పెరిగినట్టు వివరించింది. ప్రపంచ రోడ్డు ప్రమాద మరణాల్లో భారత్ వాటా 11 శాతం నుంచి 13 శాతానికి పెరిగినట్టు తెలిపింది.