షాహజహనాబాద్ (యూపీ): మహిళను పురుషుడిగా మారుస్తానంటూ ఆమెను హత్య చేసిన ఒక క్షుద్ర మాంత్రికుడిని, అతనికి సహకరించిన మృతురాలి స్నేహితురాలిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. షాహజహనాబాద్ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. పూనమ్, ప్రీతి స్నేహితులు. ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కం ఏర్పడింది.
వీరి మధ్య ఉన్న సంబంధం గురించి ఊరిలో వారికి తెలియడంతో ప్రీతి పెళ్లికి ఆటంకం ఏర్పడింది. దీంతో పూనమ్ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని ప్రీతి, ఆమె తల్లి ఊర్మిళ క్షుద్ర మాంత్రికుడు రామ్నివాస్తో హత్య చేయించారు. ఈ ఘటనలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రీతిని పోలీసులు అరెస్టు చేశారు.