న్యూఢిల్లీ, మే 4: తన కుమారుడి నామినేషన్ వేళ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిష్ భూషణ్ అర్ధ బలం, అంగ బలాన్ని ప్రదర్శించారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన అనుచరగణంతో బల ప్రదర్శనకు దిగారు.
కరణ్ నామినేషన్ సందర్భంగా నిర్వహించిన సభకు 10 వేల మంది హాజరయ్యారు. వీరిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీచైర్మన్లు, బీజేపీ స్థానిక నేతలు ఉన్నారు. అలాగే 500 నుంచి 700 వరకు ఎస్యూవీలు వచ్చినట్టు వార్తా కథనాలు వచ్చాయి. సభా వేదికపై అంతా కుర్చీల్లో కూర్చోగా…బ్రిజ్ భూషణ్ మాత్రం ఒక రాజు మాదిరి మధ్యలో సోఫాలో కూర్చోవటం చర్చనీయాంశమైంది.