న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇద్దరి అంగీకారం లేకుండా వివాహాన్ని రద్దు చేసేందుకు ఆర్టికల్ 142 కింద తమ అధికారాన్ని ఉపయోగించేలేమని పేర్కొంది. పెళ్లి అయిన తర్వాత 40 రోజులు మాత్రమే కలిసిఉండి.. రెండేళ్లుగా వేరుంటున్న తన భార్యకు విడాకులు మంజూరు చేయాలని భర్త దాఖలు చేసిన అప్పీల్పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.
భారత్లో వివాహ వ్యవస్థ అనేది ఓ సాధారణ విషయం కాదని, ఈరోజు పెండ్లి చేసుకొని రేపు విడాకులు తీసుకుంటామనే పాశ్చాత్య సంస్కృతికి మనమింకా చేరుకోలేదని బెంచ్ వ్యాఖ్యానించింది. వివాహాన్ని రద్దు చేసేందుకు నిరాకరిస్తూ భర్త అభ్యర్థనను తోసిపుచ్చింది.