ముంబై: ఏడు దశాబ్దాల్లో చంద్రుడిపై చేసిన ప్రయోగాల్లో సగం మాత్రమే సక్సెస్ అయ్యాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ తెలిపింది. ఇప్పటి వరకు 111 లూనార్ మిషన్స్ను ప్రయోగించగా.. 62 విజవంతమయ్యాయని ఆ సంస్థ ప్రకటించింది.
చంద్రయాన్-3 విజయవంతమైతే చంద్రుడిపై సక్సెస్ఫుల్గా అంతరిక్ష నౌకను దింపిన నాలుగో దేశంగా అమెరికా, చైనా, రష్యాల సరసన భారత్ చేరుతుందని తెలిపింది. 1969లో అమెరికా వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపి సువర్ణాధ్యాయాన్ని లిఖించారు.