న్యూఢిల్లీ, నవంబర్ 18: వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో దానికి చెక్ పెట్టేలా ఐఐటీ కాన్పూర్, ఐఐఎస్సీ బెంగళూరు శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఏసీని ఎయిర్ ప్యూరిఫయర్గానూ మార్చేలా యాంటి మైక్రోబియల్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సాంకేతికతతో ‘క్లీన్ ఎయిర్ మాడ్యూల్’ పరికరాన్ని తయారు చేశారు. దీన్ని ఏసీ పైభాగంలో ఉంచి, ఏసీల్లో ఫ్యాన్ మోడ్ ఆన్ చేయాలి.
ఏసీ బయటి గాలిని పీల్చే క్రమంలో పరికరంలోని ఎయిర్ ఫిల్టర్లు గాలిని శుద్ధి చేస్తాయి. దీన్ని ల్యాబ్లో పరీక్షించగా, గాలిలోని కొవిడ్-డెల్టా వేరియంట్ను విజయవంతంగా 99.24 శాతం కచ్చితత్వంతో రూపుమాపింది. తక్కువ ధరకే లభ్యమయ్యే ఈ పరికరాన్ని మార్కెటింగ్ చేసుకొనే లైసెన్స్ను ఐఐటీ-కాన్పూర్లోని ఎయిర్త్త్ అనే స్టార్టప్ దక్కించుకొన్నది.