శబరిమల: కేరళలోని శబరిమల ఆలయాన్ని మూసివేశారు. బుధవారం మండల పూజ అనంతరం ఆలయ ద్వారాలకు తాళాలు వేశారు. మకరజ్యోతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ తలుపులను ఈ నెల 30న తిరిగి తెరువనున్నారు. మండల పూజ ఉత్సవాలకు భారీగా అయ్యప్ప భక్తులు తరలివచ్చారు.