పట్నా: బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. మంగళవారం బీహార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అగ్రకుల పేదల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10 శాతంగా ఉందని, బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచితే మొత్తం రిజర్వేషన్ల శాతం 75 శాతానికి పెరుగుతుందని, మిగతా 25 శాతం ఓపెన్ కోటాగా ఉంటుందని పేర్కొన్నారు.
‘రిజర్వేషన్ల పరిమితిని కచ్చితంగా 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలి. అగ్ర కులాల పేదలకు ఇప్పటికే 10 శాతం రిజర్వేషన్ (EWS) ఉంది. దాంతో మొత్తం రిజర్వేషన్ల పరిమితి 65+10=75 శాతం అవుతుంది. మిగతా 25 శాతం ఓపెన్ కోటాగా ఉంది. గతంలో 40 శాతంగా ఓపెన్ కోటా రిజర్వేషన్ 25 శాతానికి తగ్గుతుంది. కాబట్టి బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలి. ఇది నా ప్రతిపాదన.’ అని నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు.
#WATCH | Patna: In the Bihar Assembly, Bihar CM Nitish Kumar says, “The 50% (reservation) should be increased to at least 65%… The upper caste has 10% already (EWS). So 65 and 10 make 75%. The remaining would be 25%. Earlier, 40% was free now it would be 25%. The reservation… pic.twitter.com/2UsOinNnOi
— ANI (@ANI) November 7, 2023