న్యూఢిల్లీ, జూలై 15: ‘నిర్బంధ చట్టాలు (పీడీ యాక్ట్) అత్యంత కఠి నమైనవి. విచారణ లేకుండా నిర్బం ధంలో ఉన్న వారి వ్యక్తిగత స్వేచ్ఛను అవి హరిస్తాయి. ఇటువంటి సమ యంలో చట్టంలోని నిబంధనలు మా త్రమే నిందితునికి రక్షణ కల్పిస్తాయి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు రెండుసార్లు కస్టడీని పొడిగించిన కేసులో బాధితుడిని వదిలిపెట్టాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ప్రకాష్ చంద్రయాదవ్ అలియాస్ ముంగేరి యాదవ్పై పెట్టిన కేసులో అతడి నిర్బంధాన్ని కొనసాగించాలంటూ ఝార్ఖండ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. కింది కోర్టు చట్టపరంగా అనుసరించాల్సిన నిబంధనలు పాటించలేదని, నిందితుడిని వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.