న్యూఢిల్లీ : పార్లమెంటరీ వ్యవహారాలపై కవరేజీకి సంబంధించి కొవిడ్ సంక్షోభ సమయంలో విధించిన ఆంక్షలను తొలగించాలని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ) గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది. జర్నలిస్టులు పార్లమెంట్ వ్యవహారాలను కవర్ చేయలేకపోతున్నారని పేర్కొంది.
ఆంక్షల్లో మీడియాను నియంత్రించే వ్యూహం కనిపిస్తున్నదని పీసీఐ తెలిపింది. పార్లమెంటేరియన్లు, మీడియా మధ్య కమ్యూనికేషన్ను విచ్ఛిన్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ నేపథ్యంలో పీసీఐ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.