ఇంఫాల్, జూలై 30: ప్రధాని మోదీ మౌనం వహించడం వల్లే మణిపూర్ దహనమైందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని ఉదాసీనత కారణంగానే హింస ఎక్కువైందని ‘ఇండియా’ కూటమి నేతలు విమర్శించారు. అల్లర్లను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ అనసూయ యూకీకి ఆదివారం కూటమి నేతలు విన్నవించారు.
తమ ప్రాంతానికి ప్రత్యేక పరిపాలనకు అనుమతులు ఇవ్వాలని కుకీలు డిమాండ్ చేస్తుండగా… కుకీ వర్గానికి చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొచ్చారు. మణిపూర్ను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడమే హింస కు పరిష్కారమని బీజేపీ ఎమ్మెల్యే పావోలిన్లాల్ తెలిపారు.