(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జులై 23 (నమస్తే తెలంగాణ): భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల పౌరసత్వాన్ని తీసుకుంటున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. 2022లో 2.25 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారు.
ఒక్క సంవత్సరంలోనే ఇంత మంది పౌరసత్వాన్ని వదులుకోవడం గత 12 ఏండ్లలో ఇదే అత్యధికం. 2020 నుంచి ఇప్పటి వరకు అంటే కేవలం మూడేండ్లలోనే దాదాపు 5,16,272 మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
విదేశాలకు ఎందుకు వెళ్తున్నారంటే..