న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: రొమ్ము క్యాన్సర్ కారణంగా 2040 నాటికి ఏటా 10 లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నదని న్యూ లాన్సెట్ కమిషన్ వెల్లడించింది. 2020 నాటికి గత ఐదేండ్లలో దాదాపు 78 లక్షల మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడగా, అదే ఐదేండ్ల వ్యవధిలో 6,85,000 మంది మరణించారని తెలిపింది.
2020లో దాదాపు 23 లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్ కేసులు 2040 నాటికి 30 లక్షలకు పైగా పెరుగుతాయని, అల్పాదాయ దేశాలపై ఈ వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. 2040 నాటికి క్యాన్సర్తో మరణించే వారి సంఖ్య ఏడాదికి దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని పరిశోధకుల బృందం అంచనా వేసింది.