భువనేశ్వర్ : నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ సర్కారు రాష్ట్రంలో ఓబీసీ కులగణన చేపట్టింది. త్వరలోనే నివేదిక విడుదల చేయనుంది. ఈ ఏడాది మేలో ఏర్పాటు చేసిన కమిషన్ ఇప్పటికే సర్వే పూర్తి చేసింది. రాష్ట్ర జనాభాలో 46 శాతం ఓబీసీలు ఉన్నట్టు కమిషన్ సభ్యుడు మిఠాలీ చిన్నారా తెలిపారు.
211 కులాల సామాజిక, ఆర్థిక, విద్య, కుటుంబ పరిస్థితులపై చేపట్టిన ఈ సర్వే నివేదికను సీఎం నవీన్ పట్నాయక్కు అందజేసినట్టు చెప్పారు. ఓబీసీల సర్వే పూర్తితో కులగణన పూర్తి చేసిన ఐదవ రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. అంతకుముందు బీహార్, ఎంపీ, మహారాష్ట్ర, హర్యానాలు ఈ సర్వేను నిర్వహించాయి.