న్యూఢిల్లీ: బైక్ను కారుతో ఢీకొట్టి.. యువకుడిని 3 కిలోమీటర్లు కారుపైనే ఈడ్చుకెళ్లాడో వ్యక్తి. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు మృతి చెందాడు. గత నెల 30న రాత్రి ఢిల్లీలో దీపాంశు వర్మ (30), ముకుల్ (20) బైక్పై వెళుతుండగా కారు ఢీ కొట్టింది. దీంతో దీపాంశు కారుపై ఎగిరి పడ్డాడు.
ఆ విషయం తెలిసినా కారు డ్రైవర్ 3 కిలోమీటర్లు అలాగే కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ఢిల్లీ గేట్ సమీపంలో బాధితుడిని కింద పడేశాడు. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకొచి విచారణ చేపట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.