కురుక్షేత్ర, జూన్ 15: బీఆర్ఎస్ రైతు నేత, బీకేయూ చీఫ్ గుర్నామ్ సింగ్ చడూనీ సహా తొమ్మిది మందికి కురుక్షేత్ర న్యాయస్థానం గురువారం బెయిల్ మంజూరు చేసింది. పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర చెల్లించాలంటూ ఈనెల 6న హర్యానాలోని షహబాద్ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి రైతులు ఆందోళన చేశారు.
రైతు నేతలపై హత్యా యత్నం సహా పలు కేసులను బనాయించి జైలులో పెట్టారు. రైతులు హత్యాయత్నానికి పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేనందున వారిపై పెట్టిన 307 సెక్షన్ను ఉపసంహరించుకుంటున్నట్టు పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు.