తిరువనంతపురం: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ గురువారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలంటూ కేంద్రాన్ని కోరింది.
కేరళ మంత్రి రాజేశ్ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ, ‘పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకమైన ‘నరేగా’ చట్టం వలె కాకుండా, జీరామ్ జీ పథకం కింద రాష్ట్రం 40% వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది’ అని అన్నారు.