Rajasthan | జైపూర్, ఏప్రిల్ 3: దళితురాలైన లైంగిక దాడి బాధితురాలు తన ఒంటిపై అయిన గాయాలు చూపించేందుకు కోర్టు హాల్లోనే బట్టలు విప్పాలని ఆదేశించారన్న ఆరోపణలపై రాజస్థాన్లోని కరౌలి జిల్లాకు చెందిన మెజిస్ట్రేట్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ మేరకు బాధితురాలు గత నెల 30న హిందౌన్ కోర్టు మెజిస్ట్రేట్పై ఫిర్యాదు చేసిందని డిప్యూటీ ఎస్పీ(ఎస్టీ-ఎస్సీ) సెల్ మిన మీనా బుధవారం తెలిపారు. మెజిస్ట్రేట్పై కోత్వాలి పోలీసుస్టేషన్ పరిధిలో ఐపీసీ సెక్షన్ 345, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. కాగా, బాధిత మహిళపై గత నెల 19న లైంగిక దాడి జరిగింది. ఈ ఘటనపై స్థానిక హిందౌన్ సదర్ పోలీసుస్టేషన్లో 27న కేసు నమోదైంది.