న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: పాఠ్య పుస్తకాల్లో చరిత్రను వక్రీకరించే చర్యలను మేధావి వర్గం తీవ్రంగా ఖండించింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నిపుణులు, పాఠ్య పుస్తకాలు తయారు చేసిన వారిని సైతం సంప్రదించకుండా ఎన్సీఈఆర్టీ కొన్ని పాఠ్య పుస్తకాలలో మార్పులు చేయడాన్ని రొమిలా థాపర్, జయతి ఘోష్ సహా 250 మంది చరిత్రకారులు తప్పుబడుతూ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
ఎన్సీఈఆర్టీ నిర్ణయం వెనుక విభజన ఉద్దేశం స్పష్టమవుతున్నదన్నారు. ఇది మన రాజ్యాంగ ధర్మానికి, భారత ఉపఖండ సమ్మిళిత సంస్కృతికి వ్యతిరేకమని వారు విమర్శించారు. ఇలాంటి చర్యకు ఆదిలోనే అడ్డుకట్ట పడాలన్నారు.