IUML | కోజికోడ్, మార్చి 17: ఈసీ షెడ్యూల్ ప్రకారం తమిళనాడులో ఏప్రిల్ 19న, కేరళలో ఏప్రిల్ 26న ఎన్నికలు జరుగుతాయని, వాస్తవానికి ఆ రెండు రోజులూ శుక్రవారమని ఐయూఎంఎల్ తెలిపింది.
శుక్రవారం ముస్లింలకు ఎంతో పవిత్రమైన దినమని, వారు మసీదులకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించాల్సి ఉన్నందున అటు అభ్యర్థులు, అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలకు కూడా ఇబ్బంది వస్తుందని తెలిపింది. దీనిపై తాము త్వరలోనే ఈసీని ఆశ్రయించి పోలింగ్ తేదీలను మార్చాలని విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపింది.