న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లోని పూంఛ్లో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండును గురువారం భారత సైన్యం సీజ్ చేసింది. నియంత్రణ రేఖ వెంబడి గ్రామాల్లో ఆర్మీ చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లో సంచులకొద్దీ స్టీల్ బుల్లెట్స్, ఒక ఏకే 47 రైఫిల్, రెండు పిస్టోళ్లు, ఆరు గ్రెనెడ్లు, ఐదు మ్యాగజైన్స్ లభ్యమయ్యాయని సైనిక అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
పాకిస్థాన్లో తయారైన ఔషధాలు కూడా లభించాయని చెప్పారు. మఖ్యాల్, బేయించ్ గ్రామాల్లో అనుమానితులు సంచరిస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారని ఆర్మీ అధికారులు చెప్పారు.