బెంగళూరు, సెప్టెంబర్ 7: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుపాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాంట్రాక్టులను ఇవ్వడానికి యెడియూరప్ప, ఆయన కుటుంబసభ్యులు లంచం తీసుకున్నారంటూ ఓ వ్యక్తి తొలుత సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుపాలని కోరారు. అయితే ఈ పిటిషన్ను సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో పిటిషన్దారుడు హైకోర్టుకు వెళ్లారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఆరోపణలపై విచారణ జరుపాలంటూ అడిషనల్ సిటీ సివిల్, సెషన్స్ కోర్టును ఆదేశించింది.