బార్సిలోనా: స్మార్ట్ఫోన్లు నానాటికీ మరింత స్మార్ట్గా మారుతున్నాయి. వివిధ రకాల అప్లికేషన్ల (యా ప్స్) సాయంతో ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని మన అరచేతిలోకి తెచ్చిపెడుతున్నాయి. అసలు యాప్లతో అవసరమే లేని స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో? త్వరలో ఇది కూడా కార్యరూపం దాల్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం స్పెయిన్లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో జర్మనీ సంస్థ ‘డాయిష్ టెలికం’ భవిష్యత్తు తరం స్మార్ట్ఫోన్ కాన్సెప్ట్ను ప్రదర్శించింది.
వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు మొబైల్ యాప్లకు బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేయడం దీని ప్రత్యేకత. డాయిష్ టెలికం తన ‘టీ-ఫోన్’ డివైజ్పై ఈ కాన్సెప్ట్ను ప్రదర్శించింది. ఎలాం టి యాప్లు లేని యూజర్ ఇంటర్ఫేస్ను కలిగి ఉండే ఈ కాన్సెప్ట్ను స్మార్ట్ఫోన్ చిప్ల తయారీ దిగ్గజం ‘క్వాల్కమ్’తో కలిసి అభివృద్ధి చేసింది. స్మార్ట్ఫోన్లు, ఇతర డివైజ్లలో యాప్లను వినియోగించడంం క్రమం గా తగ్గిపోతుందని, రానున్న 5-10 ఏండ్లలో మనం యాప్ల వినియోగానికి పూర్తిగా స్వస్తిపలుకుతామని తాను గట్టిగా భావిస్తున్నట్టు డాయిష్ టెలికం కంపెనీ సీఈ వో టిమ్ హోట్గెస్ ఈ సందర్భంగా తెలిపారు.