న్యూఢిల్లీ: కోవిడ్ టీకా తీసుకునే వాళ్లు.. ముందు నుంచి కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కోవిన్ పోర్టల్ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ ఇవాళ ఓ వార్తాసంస్థతో మాట్లాడారు. బూస్టర్ డోసు గురించి ఆయన కొంత క్లారిటీ ఇచ్చారు. మూడవ డోసు తీసుకోవాలనుకునే వారు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో ఆయన చెప్పారు. బూస్టర్ టీకా డోసు తీసుకోవాలనుకునే వాళ్లు 60 ఏళ్లు దాటి ఉండాలి. ఏదైనా అనారోగ్యం లేదా దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవాళ్లు మూడవ డోసుకు అర్హులు. అయితే ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వాళ్లుఉ తీసుకుని ఉండాలి. అంతే కాదు, రెండవ డోసు తీసుకున్న తేదీకి.. మూడవ డోసుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న తేదీకి కనీసం 9 నెలల వ్యవధి ఉండాలని డాక్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. రెండవ డోసుకు, మూడవ డోసుకు మధ్య 39 వారాల గ్యాప్ ఉంటేనే ఆ డోసుకు అర్హులని ఆయన తెలిపారు. ప్రికాషన్ డోసు రిజిస్టర్ చేసుకుంటున్న సమయంలో.. కోమార్బిడిటీస్ ఉన్నాయా లేదా అని కోవిన్ అడుగుతుందని, ఒకవేళ మీరు అవుని అని అంటే, అప్పుడు వ్యాక్సిన్ బుక్ చేసుకోవచ్చు అన్నారు. అయితే వ్యాక్సినేషన్ సెంటర్లో మాత్రం కోమార్బిడిటీస్ సర్టిఫికేట్ను చూపించాల్సి ఉంటుందని డాకర్టర్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. సర్టిఫికేట్ చూపిస్తేనే టీకాలు వేస్తారన్నారు. ఇండియాలో వచ్చే నెల పదవ తేదీ నుంచి మూడవ డోసును ఇవ్వనున్నారు. మూడవ డోసు కోసం మిక్సింగ్ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో.. ఆ టీకాలను ఇవ్వనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇండియాలో కోవీషీల్డ్, కోవాగ్సిన్ టీకాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు.. బూస్టర్గా అదే టీకా తీసుకోవాల్సి ఉంటుంది.