అడవిలో పులుల ఫొటోలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. మరి అడవిలో పులిని మొదటి ఫొటో తీసింది ఎవరో తెలుసా? నార్వేజియన్ మాజీ దౌత్యవేత్త ఎరిక్ సోల్హెమ్ అడవిలో పులి మొదటి ఫోటోను ట్విటర్లో షేర్చేశారు. దీనిని 1925లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి క్లిక్ చేసినట్లు చెప్పారు. ‘ఏళ్ల క్రితమే తీసిన అడవిలో పులుల అద్భుతమైన ఛాయాచిత్రాలు చూసి మేము ఆశ్చర్యపోయాం. ముఖ్యంగా భారతదేశంలో అడవిలో పులి మొదటి ఫొటోను ఎవరు తీశారు. ఇది 1925లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి (ఐఎఫ్ఎస్) తీసిన ఫొటో’ అని సోల్హెమ్ ట్విటర్లో రాశారు.
సోల్హెమ్ ట్వీట్కు వన్యప్రాణి చరిత్రకారుడు, సంరక్షకుడు రజా కజ్మీ ట్వీట్కు బదులిచ్చారు. ఈ ఫొటోను ఫ్రెడరిక్ వాల్టర్ చాంపియన్ క్లిక్ చేసినట్లు చెప్పారు. 1921 బ్యాచ్కు చెందిన ఎఫ్డబ్ల్యూ చాంపియన్ యునైటెడ్ ఫ్రావిన్స్ (ప్రస్తుత యూపీ, ఉత్తరాఖండ్) అడవుల్లో 1947వరకు సేవలందించారని వెల్లడించారు. ఆ కాలంలోనే అతడు వన్యప్రాణుల అద్భుతమైన ఫొటోలు తీశాడని తెలిపారు.
కుమావోన్ అడవుల్లో చాంపియన్ బంధించిన మరో రెండు పులుల ఛాయాచిత్రాలను రజా కజ్మీ పోస్ట్ చేశారు. ఈ ఛాయాయా చిత్రాలు మొదట అక్టోబర్ 3, 1925న ‘ది ఇల్లుస్ట్రేటెడ్ లండన్ న్యూస్’ అనే వారపత్రిక మొదటి పేజీలో ‘ఏ ట్రయాంఫ్ ఆఫ్ బిగ్ గేమ్ ఫొటోగ్రఫీ: ది ఫస్ట్ ఫొటోగ్రాఫ్స్ ఆఫ్ టైగర్స్ ఇన్ ది నేచురల్ హాంట్స్’ అనే హెడ్లైన్తో ప్రచురితమయ్యాయి. ట్రిప్ వైర్ ఫొటోగ్రఫీ అనే టెక్నిక్ను ఉపయోగించి చాంపియన్ ఈ ఫొటోలు తీసినట్లు కజ్మీ చెప్పారు.