న్యూఢిల్లీ, జనవరి 24: గర్భాశయ క్యాన్సర్ నిరోధానికి దేశీయంగా తయారు చేసిన తొలి టీకా ‘సెర్వావాక్’ను మంగళవారం ఆవిష్కరించినట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ‘జాతీయ బాలికా దినోత్సవం, గర్భాశయ క్యాన్సర్ అవగాహన నెల సందర్భంగా తొలి మేడిన్ ఇండియా హెచ్పీవీ వ్యాక్సిన్ను కేంద్ర హోం శాఖ మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించాం’ అని పూనావాలా ట్వీట్ చేశారు. డీబీటీ, బిరాక్, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు.