న్యూఢిల్లీ: అంటార్కిటికా ఖండంలోని ప్రధాని భూభాగంలో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. ఇది పర్యావరణ విపత్తుకు దారితీయొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లో తీవ్ర అనారోగ్యానికి కారణమయ్యే ఈ వైరస్ను ఈ నెల 24న గుర్తించారు.
మృతిచెందిన రెండు స్కువా పక్షుల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్ ఉనికిని గుర్తించారు. అంటార్కిటికాలో ఉండే వేలాది పెంగ్విన్లకు ఈ వ్యాధి ప్రబలే ప్రమాదమున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మనుషులకు వ్యాప్తి చెందకుండా సీఐఎస్సీ పరిశోధకులు చర్యలు చేపడుతున్నారు. పక్షుల్లో ప్రాణాంతకమైన హెచ్5ఎన్1 రకాన్ని 1997లో తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.