న్యూఢిల్లీ, మార్చి 30: కొలీజియం వ్యవస్థపై, న్యాయవ్యవస్థ స్వతంత్రతపై కేంద్ర మంత్రి రిజిజు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పలువురు మాజీ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
న్యాయవ్యవస్థ స్వతంత్రతపై రాజీపడే ప్రసక్తే లేదని, దానిపై పాలకవర్గ పెత్తనం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని తేల్చిచెప్పారు. ఈమేరకు 90 మంది మాజీ బ్యూరోక్రాట్లు బహిరంగ లేఖ రాశారు. న్యాయవ్యవస్థపై రిజిజు వ్యాఖ్యలను అందులో ఖండించారు.