న్యూఢిల్లీ: బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్పై గతంలో జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ను ఎన్ఫోర్స్మెంట్ డై రెక్టరేట్ (ఈడీ) అప్గ్రేడ్ చేసింది. ఆయన విదేశాలకు వెళ్లకుండా ఆపాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరింది.
ఈ సంస్థ విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా)ను ఉల్లంఘించినట్లు ఆరోపిస్తూ, ఈడీ దర్యాప్తు చేస్తున్నది. గతంలో జారీ చేసిన సర్క్యులర్లో వివిధ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల ద్వారా ఆయన కదలికల గురించి సమాచారం ఇవ్వాలని మా త్రమే ఇమ్మిగ్రేషన్ అధికారులను కో రింది. తాజాగా దాన్ని సవరించింది. దీని ప్రకారం ఆయన ఇకపై విదేశాలకు వెళ్లడానికి ఆస్కారం ఉండదు.