కోల్కతా, మార్చి 16: తృణమూల్ కాంగ్రెస్ కీలక నాయకుడు అనూబ్రత మండల్ కుమార్తెకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
పశ్చిమబెంగాల్లో ఆవుల అక్రమ రవాణా కేసులో విచారించాల్సి ఉన్నదని, ఈ నెల 20లోగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని ఆ సమన్లలో పేర్కొన్నది. అయితే వాస్తవానికి ఈ నెల 15న సుకన్య మండల్ హాజరుకావాల్సి ఉండగా చివరి నిమిషంలో వెళ్లలేకపోయారు.