న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఢిల్లీ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు ఓ ట్యాక్సీ డ్రైవర్ కారును దొంగలించే ప్రయత్నం చేయగా, వాహనానికి అడ్డుగా నిలిచిన డ్రైవర్ను అదే కారుతో ఢీకొట్టి ప్రాణాలు బలిగొన్నారు. కారు ముందు చక్రాల కింద అతడు చిక్కుకోగా, 300 మీటర్లు కారుతోపాటు లాక్కెళ్లారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నైరుతి ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించి వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ట్యాక్సీ డ్రైవర్గా జీవనం సాగిస్తున్న బిజేందర్ షాకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నామని, ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.