న్యూఢిల్లీ, మే 29: ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్కు ఎట్టి పరిస్థితిల్లో మద్దతు తెలపవద్దంటూ ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ పార్టీ అధిష్ఠానానికి సూచించింది. ఈ అంశంపై కాంగ్రెస్ నిశ్శబ్దంగా ఉండాలని, ఆప్కు మద్దతు తెలపరాదని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు రాహుల్గాంధీకి చెప్పారని తెలిసింది.
మద్దతు కూడగట్టేందుకు సీఎం కేజ్రీవాల్, బీజేపీయేతర రాష్ర్టాల సీఎంలను కలుస్తున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ముఖ్య నేత రాహుల్గాంధీని కలుసుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. సోమవారం న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ముఖ్యనేతలతో రాహుల్గాంధీ చర్చలు జరిపారు.