న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్పై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టుకు కేటాయించిన స్థలాన్ని న్యాయవాదుల చాంబర్ బ్లాక్ కోసం ఉపయోగించాలని కోరుతూ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ వేసిన పిటిషన్ను త్వరగా విచారించాలని వికాస్ సింగ్ సీజేఐను కోరారు. 6 నెలలుగా ఈ పిటిషన్ను జాబితాలో ఉంచేందుకు పోరాడుతున్నట్టు, 20 ఏండ్లుగా చాంబర్ల కోసం నిరీక్షిస్తున్నట్టు తెలిపారు. దీనిపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మీరు మాట్లాడకండి. ఇప్పుడే కోర్టు విడిచి వెళ్లండి. మేం భయంతో వంగిపోయేలా మీరు చేయలేరు. మేం ఖాళీగా కూర్చోంటున్నామని అనుకుంటున్నారా?’ అని అన్నారు.