హిస్సార్, మే 8: హర్యానాలోని హిసార్ లోక్సభ స్థానంలో చౌతాలా కుటుంబ పోరు రసవత్తరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయంగా ప్రభావం చూపే చౌతాలా కుటుంబానికి చెందిన ముగ్గురు నేతలు వేర్వేరు పార్టీ నుంచి బరిలో నిలిచారు. చౌతాల వంశ కోడళ్లు ఎమ్మెల్యే నైనా చౌతాలా, సునైనా చౌతాలాలు జేజేపీ, ఐఎన్ఎల్డీ నుంచి పోటీచేస్తున్నారు.
బీజేపీ నుంచి రంజిత్ సింగ్ చౌతాలా బరిలో నిలిచారు. నైనా, సునైనాల మామలకు రంజిత్ చౌతాలా సోదరుడే కావడం గమనార్హం. నైనా చౌతాలా మాజీ సీఎం ఓంప్రకాశ్ చౌతాలా పెద్ద కుమారుడు, జేజేపీ అధ్యక్షుడు అజయ్ సింగ్ భార్య. వీరి కుమారుడు అయిన దుష్యంత్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా చేశారు. ఐఎన్ఎల్డీ అభ్యర్థి సునైనా ఆ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.