న్యూఢిల్లీ: దేశంలో బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. వచ్చేవారం నుంచి భారత్ రైస్ పేరుతో రూ.29కే కిలో చొప్పున బియ్యం విక్రయించనున్నట్టు కేంద్ర ఆహారశాఖ కార్యదర్శి సంజీవ్చోప్రా శుక్రవారం తెలిపారు.
నాఫెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్సీసీఎఫ్), కేంద్రీయ భండార్ ద్వారా చౌక బియ్యాన్ని 5, 10 కిలోల ప్యాకెట్ల రూపంలో విక్రయించనున్నట్టు వెల్లడించారు. ప్రముఖ ఈకామర్స్ వెబ్సైట్లలో నూ ఈ బియ్యం లభిస్తాయన్నారు.