న్యూఢిల్లీ, : దేశంలో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ఎల్నినో ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వర్షాలు పడకపోతే ఎదురయ్యే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రాష్ర్టాలు సిద్ధంగా ఉండాలని సూచించింది. పసిఫిక్ మహా సముద్ర ఉపరితలాలు వేడెక్కితే ఎల్నినో అంటారు.
దీని కారణంగా భారత్లో రుతుపవన గాలులు బలహీనమై వర్షాభావం ఏర్పడుతుంది. ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలను ముందుగా సమకూర్చుకోవాలని సూచించింది. నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నట్టు వాతావరణ శాఖ విశ్లేషించింది.