న్యూఢిల్లీ: బీహార్లో కులగణన చేపట్టాలని రాష్ట్రంలోని నితీశ్కుమార్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని కేంద్రం వ్యతిరేకించింది. కులగణన అంశం కేంద్రం జాబితాలోనిదని, చట్టప్రకారం కులగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుందని పేర్కొన్నది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. సెన్సస్ యాక్ట్-1948 కింద జనగణన అనేది చట్టబద్ధమైన ప్రక్రియ అని, జనగణన అంశం రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో కేంద్ర జాబితాలో ఉన్నదని తెలిపింది. బీహార్లో కులగణనకు పాట్నా హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.