కోల్కతా: శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమబెంగాల్లో చెలరేగిన అల్లర్లు ముందస్తు ప్రణాళికేనన్న అనుమానాన్ని కల్కత్తా హైకోర్టు వ్యక్తం చేసింది. అల్లర్లపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తీర్పును సోమవారం రిజర్వు చేసింది. మార్చి 30న జరిగిన అల్లర్లపై ఎన్ఐఏ విచారణ జరిపించాలని బీజేపీ ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత సువేందు అధికారి పిటిషన్ దాఖలు చేశారు.
సోమవారం ఈ పిటిషన్పై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ టీఎస్ శివజ్ఞనం, జస్టిస్ హిరన్మయ్ భట్టాచార్య విచారణ జరిపారు. ఎన్ఐఏ విచారణ జరపాలనే వినతిని పశ్చిమ బెంగాల్ అడ్వకేట్ జనరల్ సౌమేంద్రనాథ్ ముఖర్జీ వ్యతిరేకించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ప్రాథమిక సమాచారాన్ని చూస్తుంటే ఈ హింస ముందస్తు ప్రణాళికతో జరిగినట్టు కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేసింది.