(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగా ణ): వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తమదేనంటూ ఇంతకాలం బీరాలు పలికిన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు ముందే కాడి దిం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దిం పేంతటి నాయకత్వ లక్షణాలు మీకున్నా యా? అంటే, మీకున్నాయా? అని బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర అధినేతలు బండి సంజయ్, రేవంత్రెడ్డి పరస్పరం సవాళ్లు విసురుకోవటం ద్వారా ఆ లక్షణాలు ఇద్దరికీ లేవని వాళ్లంతట వాళ్లే బండారాన్ని బయట పెట్టుకున్నారు. బండికి పార్టీని నడిపే నాయకత్వ లక్షణాలు లేవని రేవంత్రెడ్డి విమర్శిస్తే, అవును నిజమే, ఓటుకు నోటు పంచడం తనకు చేతకాదని బండి తిప్పికొట్టారు.
పార్టీని నడిపించటం రేవంత్రెడ్డికి ఏ మేరకు చేతనవుతుందో ఆ పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జగ్గారెడ్డిని అడిగితే చెబుతారని చురక అంటించారు. మరోవైపు కర్ణాటక ప్రజల తీర్పుతో ఇప్పటికే బిక్కచచ్చిన బీజేపీకి తెలంగాణలోనూ భవిష్యత్ లేదని ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పరోక్షంగా చేతులెత్తేసిన విషయం తెలిసిందే. దీం తో ఇంతకాలం ఎక్కడో ఒక మూలన దింపు డు కల్లం ఆశతో ఉన్న కమలనాథుల్లో ఈటల వ్యాఖ్యలు మరింత కాకరేపుతున్నాయి. బీజేపీ చేరికల కమిటీకి స్వయానా చైర్మన్ అయినా ఈటల, బీఆర్ఎస్ను గద్దె దింపటం బీజేపీతో అయ్యేపని కాదంటూ పొంగులేటి శ్రీనివాస్రె డ్డి, జూపల్లి కృష్ణారావు తనతో అన్నారని బాం బు పేల్చారు.
బీఆర్ఎస్ను గద్దె దింపుదాం… మాతో చేతులు కలపండని కొన్ని నెలలుగా ఈటల కాలికి బలపం కట్టుకొని పొంగులేటి, జూపల్లి చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చావుకబురు చల్లగా సెలవిచ్చినట్టు…రాష్ట్రంలో బీఆర్ఎస్ను గద్దె దింపటం బీజేపీతో అయ్యేపని కాదని వారు గట్టిగా నమ్ముతున్నారంటూ ఈ టల స్పష్టం చేయటం బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. పైగా బీఆర్ఎస్ను గద్దె దింపటం మీ జేజమ్మలు దిగివచ్చి నా కానీ పనంటూ పొంగులేటి, జూపల్లి తన కు రివర్స్ కౌన్సెలింగ్ ఇచ్చినట్టు ఈటల బయటపెట్టటంతో బీజేపీ నాయకత్వానికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయినంత పని అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలహీన పరచటానికి బీజేపీ అధినాయకత్వం పన్నని టక్కుటమా ర విద్యలంటూ లేవు.
ఈటల బీజేపీలో చేరిన తర్వాత దేశంలో మరే రాజకీయపార్టీలో లేనివిధంగా చేరికల కమిటీ అంటూ ఒక కమిటీని సృష్టించి, దానికి ఆయన్ని చైర్మన్ను చేశారు. ఈటల ఇలా చేరగానే అలా పోలోమంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వలసలు పోటెత్తుతాయని బీజేపీ నాయకత్వం అంచనా వేసిం ది. బీఆర్ఎస్సే కాకుండా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నుంచి చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ బీజేపీ వైపు తొంగి చూడలేదు. ఎట్టకేలకు బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావును అయినా బీజేపీలో చేర్పించి తన పరువు కాపాడుకోవాలని ఈటల రాజేందర్ భావించారు.
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లితో చర్చలకు ఈటల రాజేందర్ నేతృత్వంలో పెళ్లి చూపులకు వెళ్లినట్టు బీజేపీ ముఖ్యనేతలంతా ఖమ్మం తరలివెళ్లి బాబు…బాబు మా పార్టీలో చేరండి అం టూ కాళ్లవేళ్లా పడినా ఫలితం లేకపోయింది. బాహాటంగా చర్చించినా, రహస్యంగా చర్చించినా ఫలితం లేకపోగా చివరకు వారు బీజేపీలో కాదు చేరేది… కాంగ్రెస్లో అని ఈటల రాజేందర్ చేతులేత్తేశారు. మరోవైపు వారు కాంగ్రెస్లో చేరినా, బీజేపీలో చేరినా బీఆర్ఎస్ను గద్దె దింపేంతటి సీన్, ఇరుపార్టీల అధ్యక్షులకు లేదని పరస్పరం బండి సంజయ్, రేవంత్రెడ్డి విసురుకున్న సవాళ్లు, ప్రతిసవాళ్లు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వ పటిమను చెప్పకనే చెప్పినట్టు అయింది.