తన చివరి సందేశంలో రావత్
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం ఆదివారం విడుదల చేసింది. హెలికాప్టర్ ప్రమాదానికి ఒక రోజు ముందు డిసెంబర్ 7న సాయంత్రం ఆయన ఆ సందేశాన్ని రికార్డు చేశారు. 1971లో పాకిస్థాన్పై జరిగిన యుద్ధంలో గెలిచి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘విజయ్ పర్వ్’ కార్యక్రమం కోసం ఆయన ఈ సందేశం ఇచ్చారు. ఆదివారం ఇండియా గేట్ కాంప్లె క్స్ దగ్గర విజయ్ పర్వ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రావత్ వీడియో సందేశాన్ని ప్రసారం చేశారు. ‘1971 యుద్ధంలో అమరులైన సైనికులకు నా నివాళులు. విజయ్ పర్వ్ను పురస్కరించుకొని సైనికులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సందర్భంలో సైనికుల త్యాగాలను గుర్తు చేసుకొందాం. దేశ ప్రజలందరూ విజయ్ పర్వ్లో పాల్గొనాలి. మన సైన్యం మనకు గర్వకారణం. విజయాన్ని అందరం కలిసి వేడుక చేసుకొందాం’ అని రావత్ సందేశం ఇచ్చారు. వీడియో నిడివి 1.09 నిమిషాలు ఉన్నది. విజయ్ పర్వ్ ప్రారంభ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.