ధార్ : రెండేండ్ల క్రితం కరోనాతో చనిపోయిన వ్యక్తి ఈ నెల 15న కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్షం కావడం అందరినీ షాక్కు గురిచేసింది. తిరిగొచ్చిన వ్యక్తి (కమలేశ్ పాటీదార్) బంధువు ముకేశ్ పాటీదార్ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్లోని ధార్కు చెందిన కమలేశ్ రెండేండ్ల క్రితం కరోనాతో ఓ దవాఖానలో చేరాడు.
కొన్ని రోజుల తర్వాత అతడు చనిపోయాడని డాక్టర్లు ప్రకటించి, ఓ శవాన్ని అప్పగించారు. కరోనా కాబట్టి బంధువులు ఆ ముఖం చూడకుండానే అంత్యక్రియలు పూర్తి చేశారు.