అహ్మదాబాద్: అదానీ సంస్థ నిర్వహిస్తున్న గుజరాత్లోని అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం నాలుగు గంటల పాటు కురిసిన వర్షానికే నీటమునిగింది. రన్వే సహా విమానాశ్రయ కారిడార్లోకి నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏమిటీ దుస్థితి? అంటూ పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పించారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న వర్షాలతో హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. దీంతో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నది. గుజరాత్లో సోమవారం మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వెల్లడించింది. మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని అకోలాలో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. యవత్మాల్ జిల్లాలోని మహాగావ్ తహసీల్ పరిధి ఆనంద్నగర్ తండాలో శనివారం వరదల్లో చిక్కుకొన్న 110 మందిని అధికారులు రక్షించారు.