న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: రైల్వే ట్రాక్పై పగుళ్లు, లోపాలు గుర్తించేందుకు ఆటోమెటిక్ రైలు టెస్టింగ్ కార్లను వినియోగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇవి పట్టాలపై వాటికవే నడుస్తూ పగుళ్లను గుర్తిస్తాయి. వీటిని ‘సెల్ఫ్ ప్రొపెల్డ్ అల్ట్రాసోనిక్ రైల్ టెస్టింగ్ కార్లు’గా పిలుస్తారు. రూ. 2,450 కోట్ల వ్యయంతో 19 కార్లను ఏర్పాటు చేయనున్నారు.