న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా .. ఇండియా ఎంట్రీ ఆలస్యమవుతోంది. అయితే భారత ప్రభుత్వంతో ఏర్పడ్డ ప్రతిష్టంభన వల్లే ఆ జాప్యం జరుగుతున్నట్లు టెస్లా ఓనర్ ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరించడానికి టెస్లా ఆసక్తిగానే ఉంది. కానీ భారత ప్రభుత్వంతో ఎదురైన సవాళ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తాజా ట్వీట్లో మస్క్ తెలిపారు. ఇండియాలో దిగువ సుంకం చాలా ఎక్కువ. ఇంపోర్ట్ డ్యూటీ సుమారు 100 శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియాలో ఎప్పుడు టెస్లా లాంచ్ చేస్తారని ట్విట్టర్లో అడగ్గా.. దానికి మస్క్ రిప్లై ఇచ్చాడు. ఇండియన్ గవర్నమెంట్తో ఏర్పడ్డ సవాళ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని మస్క్ ట్వీట్ చేశాడు. ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువగా ఉండడం వల్లే ఇండియాలోకి ఎంటర్ కాలేకపోతున్నట్లు మస్క్ గత ఏడాది జూలైలో ఓ ట్వీట్ చేశారు. స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు విదేశీ కార్ల కంపెనీలకు భారత ప్రభుత్వం ప్రోత్సహాకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంపోర్ట్ మార్కెట్ను బట్టి తర్వాత నిర్ణయాలు తీసుకోనున్నట్లు మస్క్ తెలిపాడు. భారత్లో 2020-21లో కేవలం 1.3 శాతం మాత్రమే ఎలక్ట్రిక్ కార్లను అమ్మారు. 2030 నాటికి ప్రైవేటు కార్లలో 30 శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉండాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది.