శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మళ్లీ చెలరేగిపోయారు. పౌరుల లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బీహార్కు చెందిన ఇద్దరు కూలీలు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుల్వామా జిల్లాలోని ఖర్పోరా రత్నిపోరా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. శనివారం సాయంత్రం బీహార్కు చెందిన వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూలీలు గాయపడినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని ఖర్పోరా రత్నిపోరా ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు చెప్పారు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన బీహార్ వలస కూలీల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బీహార్ వలస కూలీలపై కాల్పులు జరిగిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. అయితే ఉగ్రవాదులు ఇటీవల కాలంలో పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉపాది, కూలీ పనుల కోసం జమ్ముకశ్మీర్కు వచ్చిన వారిపై కాల్పులు జరుపుతున్నారు. గతంలో కూడా బీహార్తోపాటు మరి కొన్ని రాష్ట్రాలకు చెందిన కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.