జమ్మూ కశ్మీర్లో మళ్లీ ఉగ్రవాదులు దాడులకు దిగారు. శ్రీనగర్లోని పంథా చౌక్ జెవాన్ క్యాంప్ వద్ద ఉన్న పోలీసుల వాహనంపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు అమరులు కాగా, 14 మంది పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారని అధికారులు పేర్కొన్నారు. గాయాలపాలైన వారిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించామని అధికారులు పేర్కొన్నారు.