శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు. తాజాగా శుక్రవారం శ్రీనగర్లో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బెమీనాలోని స్కిమ్స్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వద్ద ఉన్న భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది తిరిగి కాల్పులు జరుపగా ఉగ్రవాదులు పారిపోయారు. స్థానిక పౌరులను కవర్ చేసుకుని ఉగ్రవాదులు తప్పించున్నారని శ్రీనగర్ పోలీసులు తెలిపారు. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు.