శ్రీనగర్: పాక్ ఆక్రమిత కశ్మీరులో (POK) భారత్లో వాంటెడ్ ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అతడిని రియాజ్ అహ్మద్ (Riyaz Ahmad) అలియాస్ అబు (Abu Qasim) ఖాసింగా గుర్తించారు. అతడు నిషేధిత లష్కరే తోయిబాకు (Lashkar-e-Taiba) అనుబంధంగా పనిచేస్తున్నాడని, ఈఏడాది జనవరి 1న రాజౌరీ జిల్లాలోని (Rajouri district) ధంగ్రీలో (Dhangri) జరిగిన ఉగ్రదాడిలో ప్రధాన కుట్రధారి అని అధికారులు తెలిపారు. ఆ దాడిలో ఏడుగురు మృతిచెందగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, శనివారం తెల్లవారుజామున ప్రార్థనల సమయంలో రావల్కోట్ ప్రాంతంలోని అల్-ఖుదుస్ మసీదులో గుర్తు తెలియని ముష్కరులు అహ్మద్ను కాల్చి చంపారని సమాచారం. జమ్మూ ప్రాంతానికి చెందిన అహ్మద్ 1999లో సరిహద్దుల వెంబడి పరార్ అయ్యాడు. అహ్మద్ ఎక్కువగా మురిడ్కేలోని లష్కరే తోయిబా బేస్ క్యాంప్ నుంచి పనిచేస్తున్నాడు. ఇటీవల రావలకోట్కు మారాడు. అతను లష్కరే తోయిబా చీఫ్ కమాండర్ సజ్జాద్ జాత్కు సన్నిహితుడు.