శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ గుర్తుతెలియని ముష్కరుడు హతమయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున శ్రీనగర్ సమీపంలోని హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో టెర్రరిస్టులు, గాలింపు బృందాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడు ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియలేదని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.