శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని నియంత్రణ (LoC) ఉగ్రవాది చొరబాటుకు యత్నించాడు. ఈ క్రమంలో ఉగ్రవాదిని హతమార్చగా.. ఈ ఘటనలో ఓ సైనికుడు వీరమరణం పొందినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖలోని తంగ్ధర్ సెక్టార్లో శుక్రవారం ఉదయం అనుమానాస్పద కదలికలను ఆర్మీ సైనికులు గుర్తించినట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
దీంతో చొరబాటు ప్రయత్నాలను విఫలం చేసేందుకు ఆపరేషన్ చేపట్టారు. ఈ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. దీంతో బలగాలు సైతం కాల్పులు జరుపడంతో ఓ ఉగ్రవాది మృతి చెందాడు. ఈ ఆపరేషన్లో ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయాడని, ఆ ప్రాంతంలో తనిఖీలు కొనసాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.